థానే: మహిళను ఎరగా వేసి.. ఆపై బార్కు రప్పించి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఉల్హాస్నగర్లోని ఓ బార్లో మంగళవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దీపక్ బోయిర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మనేర్ గ్రామంలో నివసిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం దీపక్, నరేశ్ చావన్ అనే వ్యక్తితో గొడవ పడ్డాడు. ఓ మహిళ విషయంలో వారిద్దరూ పోట్లాటకు దిగారు. ఇది మనసులో పెట్టుకున్న చావన్ ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అందుకోసం అతన్ని బార్కు రప్పించాలని ప్లాన్ వేశాడు. అందులో భాగంగా ఓ మహిళ పేరుతో దీపక్కు కాల్ చేసి బార్కు రావాలని కోరాడు.
పాత గొడవకు ప్రతీకారంగా.. హత్య