కర్నూలు రాజధాని: న్యాయవాదుల సంబరాలు

సాక్షి, కర్నూలు: కర్నూలు జూడిషియల్‌ క్యాపిటల్‌గా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అమోదం తెలపడంతో కర్నూలు వాసుల, న్యాయవాదులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కోర్టులో మిఠాయిలు పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా మూడు రాజధానుల ఏర్పాటుకు కెబినెట్‌ అమోదం‍ తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.