ముంబై: మహారాష్ట్ర పోలీసులు ట్రాఫిక్ను కంట్రోల్ చేసేందుకు మరోసారి పాత పద్ధతిని అనుసరించబోతున్నారు. శివాజీపార్క్లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం మౌంటెడ్ పోలీస్ యూనిట్ను విధుల్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ తెలిపారు. మహానగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా 1932లో మౌంటెడ్ పోలీస్ యూనిట్ సేవలను రద్దు అయినట్లు మంత్రి వెల్లడించారు. నేటి ముంబై పోలీసులు అధునాతన జీపులు, మోటర్ సైకిళ్లు వాడుతున్నారు.
'88 ఏళ్ల తర్వాత గుర్రాలపై పోలీసుల గస్తీ'